ఇంతకు జగన్ పార్టీ ఎవరిని బెదిరిస్తున్నట్టు?

whom YS Jagan Mohan threatsఫిరాయింపులకు వ్యతిరేకం అనే పేరుతో వైకాపా వచ్చే శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అసలకైతే జగన్ పాదయాత్రలో బిజీగా ఉండి అసెంబ్లీ కి వెళ్లకూడదని డిసైడ్ చేసారు. అసెంబ్లీ లో అంత తానే వ్యవహరిస్తారు జగన్. ఆ స్థానం వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకనే మొత్తానికి బహిష్కరించారని వైకాపాలో టాక్.

ADVERTISEMENT

మరోవైపు ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. అయినాసరే వైకాపా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. తాము అసెంబ్లీ కి రావాలంటే ఫిరాయింపుల మీద ఏక్షన్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.

కొందరైతే ఫిరాయింపులపై ఏక్షన్ తీసుకుంటే అసెంబ్లీ కి వచ్ఛే విషయంపై ఆలోచన చేస్తాం అంటున్నారు. అయితే ఈ ఆలోచించడం ఏంటో ఎవరికీ అర్ధం కాదు. అసెంబ్లీ కి రాము అని ఎవరిని బెదిరిస్తున్నట్టు. వైకాపా అసెంబ్లీ కి రాకపోతే నష్టం ఆ పార్టీకే. ప్రజాసమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పోతాది.

అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ కు అత్యధిక మీడియా కవరేజ్ వస్తుంది ఇప్పటిదాకా. ప్రతిపక్షం సభలో లేకపోతే పాలకపక్షం ఇంచక్కా తనకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకునే వెళ్ళిపోతారు. ఈ విషయాన్నీ జగన్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మరో వైపు 6వ తారీఖు నుండి జగన్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు.

6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని జగన్ నమ్మకం. పాదయాత్ర తరువాత 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర కూడా చెయ్యబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories