జగన్ కక్ష్య సాధింపు రాజకీయాలకు ఇది పరాకాష్ట..!

YS Jaganసమయం లేదు మిత్రమా..! అన్న చందంగా జగన్ వ్యవహారశైలి ఉంది అంటున్నారు రాజకీయ విజ్ఞులు. ఏదోరకంగా చంద్రబాబుని జైల్లో ఉంచాలి అన్న ధోరణితోనే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుంది. ఇందుకు ప్రతిగా బాబు పై మరో పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు అంటూ వేసిన కేసులో బెయిల్ వస్తే మరో కేసులో బాబుని అదుపులోకి తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని AP CID కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ను చంద్రబాబు తన సన్నిహితుల భూములకు దగ్గరగా వచ్చేలా ప్లాన్ ను మార్చారని.., అందుకు గాను చంద్రబాబు పెద్దమొత్తంలో ప్రతిఫలం పొందారనే ఆరోపణతో ఏసీబీ కోర్టులో ప్రభుత్వం పీటీ వారెంట్ జారీచేశారు.

ADVERTISEMENT

మరో కొన్ని నెలల వ్యవధిలో జగన్ ముఖ్యమంత్రి పదవికి కాలం ముగియనుంది అందులోనే భాగంగానే తాను చూడాలనుకుంటున్న.,చేయాలనుకుంటున్న కార్యక్రమాలకు ప్రణాళికలను రుపొంచించు కుంటున్నట్టుంది జగన్ వైఖరి. తానూ జైలుకి వెళ్ళొచ్చాను కాబట్టి రాష్ట్రంలో అందరిని జైలుకు పంపాలి అనేదే జగన్ ఆలోచన సరళి అని జనసేన అధినేత పవన్ అన్నట్లుగా ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి.

జగన్ రాజకీయ కక్ష్య సాధింపులు పరాకాష్టకు చేరాయి అన్న తీరుగా వైసీపీ నేతల విమర్శలు ఉన్నాయి. ముందుగా చంద్రబాబు.., ఆతరువాత ఆయన బాబు లోకేష్ ..,ఇది ఆరంభం మాత్రమే ఇంకా చూడాల్సింది చాలానే ఉంది అంటూ తెలుగు దేశం కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రోజా. రాజును పట్టే ప్రజలు అన్న చందంగా అధినేతను పట్టే నేతలు అంటూ టీడీపీ శ్రేణులు దీనికి కాలమే సమాధానం చెప్తుంది అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories