ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో మహాధర్నా అంటూ ప్రకటించింది. అట్టహాసంగా జగన్ జెండా ఊపిమరీ పంపించారు వారిని. హోదా కోసం పోరాటం పేరుతో అసెంబ్లీని కూడా బహిష్కరించారు. అయితే చివరికి ఢిల్లీలో పోరాటం అనేది బూటకంగా మారింది. ఢిల్లీలో మాట తప్పిన బీజేపీ మీద పోరాడటం మానేసి చంద్రబాబుపై విమర్శలతోనే సరిపెట్టారు.
“నాడు రాష్ట్రాన్ని చీల్చావ్… ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తాకట్టుపెట్టావ్”, “అన్ని పక్షాలు ప్రత్యేక హోదా వైపు… తెలుగు దేశం ఎటు వైపు” వంటి నినాధాలు, ప్లకార్డులతో కేంద్రంపై ఒత్తిడి ఎలా వస్తుందనుకున్నారో వారికే తెలియాలి. ఢిల్లీలో మహాధర్నా అంటే కేంద్రంపై పోరాడుతున్నారు అని జనం అనుకుంటారు అదే సమయంలో మోడీని ఏమి అనకుండా చంద్రబాబుని తిట్టేస్తే సరిపోతుంది అనే వ్యూహంతో ఉన్నట్టు ఉన్నారు.
ఇలాంటి సంకుచిత మనస్తత్వం వల్లే కేంద్రం రాష్ట్రం మీద చిన్న చూపు చూస్తుంది. చంద్రబాబును దూషించడానికైతే అది ఎలాగూ రోజు రాష్ట్రం చేస్తూనే ఉన్నారు కదా? ఈ మాత్రం దానికి ఢిల్లీ దాకా ఎందుకో? మోడీని ఎమన్నా అంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో అనే భయంతో రాజకీయాలు చేస్తూ మేమే ప్రత్యేక హోదా పోరాట యోధులు అని చెప్పుకుంటే ప్రజలు నమ్మేస్తారా?



