తెలంగాణలో కవిత రాజకీయ ప్రయాణం తిరిగి జీరో నుంచి మొదలయింది. ఇన్నాళ్ళుగా గులాబీ నీడన, కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన కవిత ఇప్పుడు సొంతగా తన రాజకీయ ప్రయాణంలో ఒక్కోఅడుగు వేస్తూ ఒంటరి పోరాటం చేస్తుంది.
అయితే కవిత ఒంటరి పోరాటం వెనుక ఎన్నో ఏళ్ళ తన రాజకీయ అనుభవం, మరెన్నో ఏళ్ళ రాజకీయ ప్రయాణం ఉంది. ఈ అనుభవం, ఆ ప్రయాణం కలిపి తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య మీద కవిత స్పందన కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ లో మొంథా తుఫాన్ తెచ్చిన జల ప్రళయం పై కవిత పరామర్శల యాత్ర మొదలుపెట్టింది.
తుఫాన్ దాటికి తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పలు జిల్లాలో అపార పంట నష్టం కలిగింది. అయితే ఇందుకు రేవంత్ సర్కార్ పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 10 వేలు అంటూ నష్టపరిహారం ప్రకటించింది.
అయితే కవిత మాత్రం ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం సరిపోదని, ఎకరాకు ప్రతి రైతుకి 50 వేలు ప్రకటించాలంటూ ప్రభుత్వ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు.
కవిత డిమాండ్లు విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ప్రజలు ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే ముందుగా వారి వద్దకు వెళ్లి ఆ సమస్య పై తన స్పందన తెలిపి వారికీ మద్దతుగా నిలబడం కవిత రాజకీయలపై కనపరిచే శ్రద్ధకు అద్దం పడుతుంది.
బిఆర్ఎస్ మాదిరి ఫామ్ హౌస్ రాజకీయాలకు దూరంగా, సోషల్ మీడియాలో పోస్టుఅల్తో సరిపెట్టకుండా తనవంతుగా గ్రౌండ్ లెవల్ లోకి వెళుతున్నారు.
ఇటు ఏపీలో ప్రతిపక్ష నేత కోసం పోరాటం చేస్తున్న జగన్ కేవలం మీడియాలో ప్రెస్ మీట్లు, వీడియో కాన్ఫరెన్స్ లు, సోషల్ మీడియాలో పోస్టులతో సరిపెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున నేను ఉన్నాను అను మీడియాలో కనిపించే జగన్ సోదరి షర్మిల అయితే తనకు అవసరం ఉన్నప్పుడు, తనకు సమయం చిక్కినప్పుడు మాత్రమే రాష్ట్ర సమస్యల పై స్పందించేందుకు ముందుకొస్తారు.
ఇక్కడ షర్మిలకు రాజకీయం కేవలం అవసరం మాత్రమే కానీ అక్కడ కవితకు రాజకీయం అనేది ఒక ప్రొఫిషన్. కవిత బిఆర్ఎస్ తో తనకున్న రాజకీయ అనుబంధాన్ని తెంచుకుని తన సొంత ఎదుగుదల కోసం శ్రమిస్తున్నారు. అయితే ఆ శ్రమను పరామర్శలతో మొదలుపెడుతున్నారు, పాదయాత్రలతో కొనసాగించాలనుకుంటున్నారు.






