మారని జగన్ తీరు… తీసుకునేది చెత్త నిర్ణయం మళ్ళి దానికి సమర్ధన

no change in YS Jagan Characterవైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత,విపక్ష నేత జగన్ తన పాదయాత్ర కోసం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ లో ఎప్పుడు అంత తానే అన్నట్టు వ్యవహరించే జగన్ తమ పార్టీ నేతలకు ఆ అవకాశం ఇవ్వరాదు అనే ఉద్దేశంతో ఫిరాయింపుల పేరుతో సమావేశాలను బహిష్కరించారు. రాజకీయ విశ్లేషకులు అంత ఇది ఒక అనాలోచిత చర్యగా అభివర్ణించారు.

ADVERTISEMENT

అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే ప్రతిపక్షానికి తన గళం వినిపించే అవకాశం ఉంటుంది. ప్రజలంతా దానిని ఆసక్తికరంగా గమనిస్తారు. అలంటి చక్కటి అవకాశాన్ని జగన్ చేతులారా పోగొట్టుకున్నారు. ప్రతిపక్షం లేకపోవడంతో ప్రభుత్వం తను చెప్పాల్సింది చెప్పుకుపోయి, కావలసిన బిల్లులను ఆమోదించుకుంటుంది.

అయితే ఈ చెత్త నిర్ణయాన్ని ఆ పార్టీ మరియు వారి మీడియా సమర్ధించుకునే పనిలో పడింది. తెలుగుదేశం ప్రభుత్వం బహిరంగంగా చేస్తున్న ఫిరాయింపుల పర్వంపై దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి జగన్ ఎత్తుగడ ఫలించిందంట. ఫిరాయింపులపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి ఇది ఆస్కారం ఇచ్చిందట.

కాబట్టి జగన్ నిర్ణయం సఫలం అయినట్లే అని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. దీని గురించి జాతీయ మీడియాలో గాని జాతీయ స్థాయిలో గాని ఇప్పటిదాకా చర్చ జరిగింది లేదు. కనీసం ఆ పార్టీ నాయకులు కూడా జాతీయ మీడియాలో దీని గురించి మాట్లాడింది లేదు. ఈ వైఖరి చూస్తుంటే నిర్ణయం అంటూ తీసుకున్నాం కాబట్టి ఏదో రకంగా సమర్దించేసుకుందాం అన్నట్టు ఉంది ఆ పార్టీ వ్యవహారం.

ADVERTISEMENT
Latest Stories