విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేంద్రం చేసిన సాయంపై నిజాలను తెలుసుకునేందుకు పవన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జేఎఫ్సీ తయారుచేసిన పూర్తిస్థాయి నివేదికను కాసేపటి క్రితం విడుదల చేశారు. నివేదికలోని అంశాలను పవన్ మీడియాకు వివరించారు. ఈ సంధర్భంగా కమిటీ సభ్యులు – పద్మనాభయ్య, జయప్రకాష్ నారాయణ చాలా వరకు కేంద్రాన్ని తప్పు పట్టారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా వరకు రాష్ట్రప్రభుత్వాన్ని నిందించారు.
అలా అని పవన్ కేంద్రాన్ని సపోర్ట్ అయితే చెయ్యలేదు కానీ ఎక్కువగా చంద్రబాబుని నిందించారు. హోదానో, ప్యాకేజో సీఎం చంద్రబాబు తేల్చుకోలేకపోయారని, అంత అనుభవజ్ఞడు అయోమయానికి గురైతే… ప్రజలకు ఎలా తెలుస్తుందని పవన్కల్యాణ్ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని మరోసారి ప్రశ్నించారు. కేంద్రం నెలకొల్పాల్సిన విద్యా సంస్థలకు నిధులు ఇవ్వకపోవడానికి కూడా ఒకానొక సంధర్భంలో రాష్ట్రాన్నే నిందించారు ఆయన.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు తాను సమన్వయంగా ఉంటా అని ప్రజలని అనవసరంగా రెచ్చగొట్టానని చెబుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాత్రం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడలేదు అని అడుగుతున్నట్టుగా ఉంది. పోలవరం, అమరావతి అనుమతులనుండి నిధులవరకు అన్నిటికి కేంద్రంపై ఏపీ ఆధారపడాల్సిందే. అటువంటి సమయంలో కొట్లాడామని ఎలా చెబుతున్నారో? స్టేటస్ ఎలాగూ ఇవ్వరనే ప్యాకేజీకి ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వకపోయేసరికి ఎదురు తిరుగుతున్నారు. దాంట్లో తప్పేంటి? పవన్ చెప్పినట్టు చంద్రబాబు ప్రభుత్వం రోడ్డెక్కితే కియా మోటార్స్, ఇసుజు మోటార్స్, హీరో లాంటి దిగ్గజాలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవా? ఎప్పుడూ గొడవలతో ఉద్రిక్త పరిస్థితి ఉండే రాష్ట్రానికి జరిగే నష్టం ఎవరు పూడుస్తారు?
రెవిన్యూ లోటు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఇద్దరిది తప్పు అంటున్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం ఇస్తామనదానికి మనకు రావాల్సిన దానికీ దాదాపుగా 10000 కోట్లు తేడా ఉంటే ఎలా ఒప్పుకుంటుంది రాష్ట్రం? ఒప్పుకుంటే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ తక్కువకి ఎందుకు ఒప్పుకున్నారు అని అడిగారా? రాష్ట్రం పోలవరం నిర్మాణ బాధ్యతను తీసుకోవడం తప్పు అంటున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీకి కట్టే చిత్తశుద్ధి లేదనే తీసుకున్నారు అది తప్పు ఎలా అవుతుంది? చాలా జాతీయ ప్రాజెక్టులు ఇప్పటికే కదులు మెదులు లేకుండా ఉన్నవి. వాటిలాగే పోలవరం కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారా?



