వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన కూల్చివేతల చేదు జ్ఞాపకాలలో ఇప్పటం గ్రామస్తులు కూడా బాధితులే. నాడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు గాను ఇప్పటం గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు సభ ఏర్పాటు చేసుకునేందుకు భూమి ఇచ్చారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామం పై, ఆ గ్రామస్తుల పై రాజకీయ కక్ష్య సాధించింది అనేది నాటి జనసేన వాదన.
ఆ కారణంగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇల్లు, ప్రహరీ గోడల కూల్చివేతలకు ఆదేశాలిచ్చారని, వారికి అండగా జనసేన నిలబడుతుందని, పవన్ కళ్యాణ్ ఉన్నాడని పవన్ వైసీపీ దూకుడు విధానాలను ఎదురించి ఇప్పటం పర్యటనకు వెళ్లారు.
అయితే ఆ సమయంలో పవన్ కు గ్రామంలోకి వెళ్ళడానికి అనుమతి లేదంటూ అధికారులు పవన్ ను నిరువరించే ప్రయత్నం చేయగా అందుకు పవన్ కాలినడకన కొంతదూరం, కారు పై ప్రయాణించి మరికొంత దూరం ఇప్పటం చేరుకున్నారు. అలాగే కూల్చివేతల బాధితులకు ఒక్కక్కరికి లక్ష రూ. చొప్పున పరిహారం ప్రకటించారు.
అప్పట్లో పవన్ ఇప్పటం పర్యటన రాష్ట్రంలో సంచలంగా మారిన విషయం తెలిసిందే, అలాగే ఆ పర్యటనకు గాను పవన్ పై వైసీపీ కేసు కూడా నమోదు చేయడం గమనార్హం. అయితే ఆ సమయంలో అధికారంలోకి వచ్చాక తిరిగి ఇప్పటం లో పర్యటిస్తానని అక్కడి గ్రామస్తులకు పవన్ ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పవన్ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటిని సందర్శించి, వారి కుటుంబాన్ని పలకరించారు. అలాగే తనను కొడుకుగా భావించిన నాగేశ్వరమ్మ కు మరికొంత ఆర్థిక సాయం అందించడంతో పాటుగా ఆమె మనవడు చదువుకి లక్ష రూ. సహాయాన్ని ప్రకటించారు పవన్.
అయితే నాడు ప్రభుత్వ vs పవన్ అన్నట్టుగా సాగిన ఈ ఇప్పటం పర్యటన నేడు ప్రభుత్వ ప్రోటోకాల్స్ తో లాంఛనప్రాయంగా ముందుకెళ్లింది. అలాగే నాడు పవన్ పర్యటనను అడ్డుకున్న అధికారులే నేడు దగ్గరుండి పవన్ పర్యటనను విజయవంతం చేసారు.
వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన కూల్చివేతల చేదు జ్ఞాపకాలలో ఇప్పటం గ్రామస్తులు కూడా బాధితులే. నాడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు గాను ఇప్పటం గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు సభ ఏర్పాటు చేసుకునేందుకు భూమి ఇచ్చారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామం పై, ఆ గ్రామస్తుల పై రాజకీయ కక్ష్య సాధించింది అనేది నాటి జనసేన వాదన.
ఆ కారణంగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇల్లు, ప్రహరీ గోడల కూల్చివేతలకు ఆదేశాలిచ్చారని, వారికి అండగా జనసేన నిలబడుతుందని, పవన్ కళ్యాణ్ ఉన్నాడని పవన్ వైసీపీ దూకుడు విధానాలను ఎదురించి ఇప్పటం పర్యటనకు వెళ్లారు.
అయితే ఆ సమయంలో పవన్ కు గ్రామంలోకి వెళ్ళడానికి అనుమతి లేదంటూ అధికారులు పవన్ ను నిరువరించే ప్రయత్నం చేయగా అందుకు పవన్ కాలినడకన కొంతదూరం, కారు పై ప్రయాణించి మరికొంత దూరం ఇప్పటం చేరుకున్నారు. అలాగే కూల్చివేతల బాధితులకు ఒక్కక్కరికి లక్ష రూ. చొప్పున పరిహారం ప్రకటించారు.
అప్పట్లో పవన్ ఇప్పటం పర్యటన రాష్ట్రంలో సంచలంగా మారిన విషయం తెలిసిందే, అలాగే ఆ పర్యటనకు గాను పవన్ పై వైసీపీ కేసు కూడా నమోదు చేయడం గమనార్హం. అయితే ఆ సమయంలో అధికారంలోకి వచ్చాక తిరిగి ఇప్పటం లో పర్యటిస్తానని అక్కడి గ్రామస్తులకు పవన్ ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పవన్ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటిని సందర్శించి, వారి కుటుంబాన్ని పలకరించారు. అలాగే తనను కొడుకుగా భావించిన నాగేశ్వరమ్మ కు మరికొంత ఆర్థిక సాయం అందించడంతో పాటుగా ఆమె మనవడు చదువుకి లక్ష రూ. సహాయాన్ని ప్రకటించారు పవన్.
అయితే నాడు ప్రభుత్వ vs పవన్ అన్నట్టుగా సాగిన ఈ ఇప్పటం పర్యటన నేడు ప్రభుత్వ ప్రోటోకాల్స్ తో లాంఛనప్రాయంగా ముందుకెళ్లింది. అలాగే నాడు పవన్ పర్యటనను అడ్డుకున్న అధికారులే నేడు దగ్గరుండి పవన్ పర్యటనను విజయవంతం చేసారు.






