ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతూ ఉంటే, మరో వైపున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. వై.ఎస్. జీవితచరిత్రను గతంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కించాలని పూరీ జగన్నాథ్ ప్రయత్నించాడు. అయితే ఎందుకనోగానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
తాజాగా వై.ఎస్. బయోపిక్ ను సిద్ధం చేయడానికి ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ మధ్య ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో సక్సెస్ ను సాధించిన ‘మహి వి.రాఘవ్’ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి .. రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ‘పాదయాత్ర’ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇంకో వైపు కేసీఆర్, చంద్రబాబుల జీవితచరిత్రలు లైన్ లో ఉన్నాయి.



