ప్చ్… రిలీజ్ కష్టాలు… వెంటాడుతున్నాయి..!

Aaradugula Bullet Movie Release Controversyఏదొక వివాదంతో బాలీవుడ్ సినిమాల మాదిరే టాలీవుడ్ మూవీస్ కు కూడా ఫ్రీ పబ్లిసిటీ లభించడం పరిపాటిగా మారిపోతోంది. ఇటీవల “దువ్వాడ జగన్నాధమ్” పాట విషయంలో చెలరేగిన వివాదం, చివరికి దర్శకనిర్మాతలు వెనక్కి తగ్గే వరకు చేసింది. అయితేనేం… కావల్సినంత పబ్లిసిటీ ఈ సినిమా సొంతమైంది. అయితే ఈ సారి గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” సినిమా ఆర్ధిక వివాదాలతో వార్తల్లో నిలిచింది.

అసలు విడుదల అవుతుందో, కాదో అనుకున్న ఈ సినిమా అనేక వాయిదాల తదనంతరం జూన్ 9వ తేదీకి వాయిదా పడింది. ఈ సారి రిలీజ్ పక్కా… అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఇటీవల ఏర్పాటు చేసి, కాస్త హంగామా చేసారు. అయితే ఏ మాత్రం బజ్ లేనటువంటి ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకున్నా, లేకున్నా తాజాగా ఓ ఎన్ఆర్ఐ మాత్రం సీసీఎస్ లో ఫిర్యాదు చేసారు.

ADVERTISEMENT

ఈ చిత్రం కోసం నిర్మాత సి.కళ్యాణ్ 6 కోట్లు తన వద్ద తీసుకుని మోసం చేశారని సహదేవ్‌ అనే ఓ ఎన్ఆర్ఐ సీసీఎస్‌ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సారైనా విడుదల అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉండగా, ఈ లోపున మ్యాటర్ సెటిల్ అవుతుందో లేదో చూడాలి. గతంలో కూడా కళ్యాణ్ పై ఇలాంటి ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories