తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ చెన్నై సిటీ పోలీస్ కంట్రోల్ రూంకి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. పొయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ ఫోన్ లో హెచ్చరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆఘమేఘాల మీద పొయెస్ గార్డెన్ కు భద్రతను పెంచి, వచ్చిన కాల్ పై దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఈ ఫోన్ కాల్ విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు.
ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసు బృందాలు మరకణ్ణం చేరుకుని, ఆగంతకుడు చేసిన పోన్ కోసం గాలించారు. చివరికి ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తానని బెదిరించింది భువనేశ్వరన్ అనే ఓ 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. దీంతో బాలుడిన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాంబు బెదిరింపును మాత్రం తేలిగ్గా తీసుకోని అధికారులు పొయెస్ గార్డెన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.



