చంద్రబాబు సాయం… వరద సాయానికి కొత్త నిర్వచనమే!

chandrababu-naidu-flood-help

విజయవాడ వరద బాధితులను సహాయ పునరావాసంతో ప్రభుత్వం బాధ్యత పూర్తయిపోయిందని సిఎం చంద్రబాబు నాయుడు అనుకోలేదు. ఫైర్ ఇంజన్లను పంపించి ముంపు ప్రాంతాలలో ఇళ్ళను కూడా శుభ్రం చేయించారు.

ADVERTISEMENT

ముంపు ప్రాంతాలలో వాహనాలు, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాల మరమత్తులకి ఆయా కంపెనీలు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మాట్లాడి అవసరమైన సాయం అందేలా చేస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొట్ట మొదటగా ప్రముఖ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జీ స్పందించింది.

తమ కంపెనీ ఉత్పత్తులు ఏవైనా వరదల పాడైపోతే వాటికి ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు ఉచితంగా మరమత్తులు చేసి ఇస్తామని ప్రకటించింది. వాటి విడి భాగాలపై కూడా 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. కనుక విజయవాడలో వరద బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరింది.

సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విజయవాడలో విద్యాధరపురంలోని రమ్యాకృష్ణా ఏజన్సీస్ గ్యాస్ ఏజన్సీ వరద బాధితుల గ్యాస్ స్టవ్‌లు ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని ప్రకటించింది.

అలాగే పలువురు బైక్, కార్ మెకానిక్కులు కూడా ఉచితంగా లేదా నామ మాత్రపు ఛార్జీతో వరద బాధితుల వాహనాలు మరమత్తు చేసి ఇస్తున్నారు.

విజయవాడ వరదలలో కొన్ని వేల బైక్‌లు, స్కూటీలు, కార్లు, ఆటోరిక్షాలు వగైరా వాహనాలు దెబ్బ తిన్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలిస్తే, త్వరలోనే వాటి మరమత్తులకు ఇదే విదంగా ఆయా కంపెనీలు కూడా ముందుకు రావచ్చు. లేదా వాహన ఇన్స్యూరెన్స్ కంపెనీలు వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లించవచ్చు.

వరదలొస్తే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం పోట్లాలు అందించడమే కాదని మనసు ఉంటే అంతకు మించి చాలా చేయవచ్చని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు. మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇటువంటివి కలలో కూడా ఊహించలేరేమో?

ముఖ్యమంత్రిగా విఫలమైన జగన్మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నేతగా కూడా విఫలమవుతున్నారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి వారికి ఏ సాయం చేయకుండా, వారికి ఇంతగా సహాయపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బురద రాజకీయాలు చేస్తున్నారు. వైసీపి, జగన్‌ తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కూడా గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories