‘ఖైదీ నంబర్ 150’ సినిమా ద్వారా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ హంగామా చేసిన మెగాస్టార్ చిరంజీవి, త్వరలో ‘ఊయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోపున ఓ సమ్మర్ ట్రిప్ లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి చైనా వెళ్ళిన విషయం, ఇటీవల దాసరి మరణం ద్వారా తెలిసింది. తాజాగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి.
ADVERTISEMENT
సతీమణి సురేఖతో పాటు ఒకప్పటి సినీ హీరోయిన్ రాధిక అండ్ కో కూడా భాగస్వామ్యులు అయిన ఈ ట్రిప్ బాగా జరిగిందంటూ… రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేసుకుంది. తన జీవితంలో మెమరబుల్ జ్ఞాపకాలను మిగిల్చిందంటూ రాధిక పోస్ట్ చేసిన ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి క్లిక్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ సెల్ఫీ ఫోటో వైరల్ అయ్యింది. ఎంతైనా మెగాస్టార్ క్లిక్ కదా… మెమరబుల్ కాకుండా ఎలా ఉంటుంది..?!
ADVERTISEMENT



