sahakar-taxi

ప్రముఖ ప్రయివేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన రాపిడో, ఓలా, ఉబర్….సేవలు ప్రజల నుండి విశేష ఆదరణ చూడగొన్నాయి. అలాగే ఈ విధానం తో లక్షలాది మంది నిరుద్యోగులకు జీవనోపాధి కూడా దొరికినట్లయింది. వినోయోగదారులకు అనుకూలమైన ధరలతో ఈ ఆన్ లైన్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో వీటి వినియోగం నానాటికి విస్తరిస్తుంది.

Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి

అయితే ఈ సేవలను వినియోగించుకుంటున్న వినియోగదారులకు, వీటిని అందుబాటులో ఉంచుతున్న కార్పోరేట్ సంస్థలకు వీటి వల్ల తగిన లబ్ది చేకూరుతున్నప్పటికీ ఆ సేవలను నేరుగా అందుబాటులోకి తీసుకొస్తున్న రైడర్స్ కు మాత్రం వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అనే ఆవేదనైయితే వ్యక్తమవుతోంది.

కమిషన్ల పేరుతో బడా వ్యాపార సంస్థలే వారి ఆదాయానికి గండికొడుతున్నాయనే భావన ఈ సేవలను అందిస్తున్న రైడర్లలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కమిషన్ల దందాకు పూర్తిగా చెక్ పెట్టెలే కేంద్ర ప్రభుత్వం “సహకార టాక్సీ” పేరుతో ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read – అసలే రోజులు బాలేవ్‌.. అమిత్ షాతో చంద్రబాబు ఏం చెప్పారో!

మధ్యవర్తులు లేకుండా వాహనదారులకు నేరుగా లబ్ది చేకూరేలా త్వరలో ఈ సహకార టాక్సీ యాప్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. నేడు జరిగిన లోక్ సభ సమావేశంలో సహకార మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ సహకార టాక్సీ యాప్ ద్వారా ముఖ్యంగా రైడర్లకు కమిషన్ల బెడద తప్పదన్నారు, తద్వారా అటు వినియోగదారులకు, ఇటు రైడర్లకు ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందన్నారు.




ఈ యాప్ ద్వారా బైకులు, టాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్ విలీర్స్ సేవలు అందుబాటులోకి రానున్నట్టు ప్రకటించారు షా. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘సహకార్ సే సమృద్ధి’ ద్వారా రానున్న రోజులలో ఈ సహకార టాక్సీ సేవలు అందరికి అందుబాటులోకి రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్దేశికత్వంలో వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్న సహకార టాక్సీ తో ఇప్పటి వరకు ఈ వ్యాపార సామ్రాజ్యంలో రాజ్యమేలిన ఓలా, రాపిడో, ఉబర్ సేవలకు చెక్ పడనుందా.?

Also Read – సెలబ్రెటీలు తస్మాత్ జాగ్రత్త..!