కవిత తెరాస కేసీఆర్ బిఆర్ఎస్ నోరు నొక్కేస్తుందా అన్నట్టుగా బిఆర్ఎస్ తన 25 వ ఆవిర్భావ వేడుకలను చాల నిశ్శబ్దంగా జరుపుకుంటుంది. తెరాస పేరుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన కేసీఆర్ కు అదే తెరాస పేరుతో ఊహించని రాజకీయ షాక్ ఇచ్చారు కవిత.
కవిత తన పార్టీ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ని ఉద్దేశించి ‘మారిన మనిషి – మరమనిషి’ అంటూ సంభోధించిన బిఆర్ఎస్ నుంచి ఆ స్థాయి ప్రతిస్పందన కనిపించలేదు. అటు కవిత పై ప్రత్యారోపణలు చెయ్యలేక ఇటు కవిత విమర్శల పై మౌనం వహించలేక బిఆర్ఎస్ నేతలు కుడితిలో పడ్డ ఎలుకల మాదిరి అల్లాడుతున్నారు.
ఇటువంటి సందర్భంలో నేడు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు కేవలం జెండా ఆవిష్కరణతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 25 వసంతాలు పూర్తి చేసుకుని అట్టహాసంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవాల్సిన బిఆర్ఎస్ కవిత తెరాస తో మౌనంలోకి వెళ్లిపోయిందా అన్నది తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిపోయింది.
బిఆర్ఎస్ ఒక పార్టీ కాదు అదొక విప్లవం అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇక పోరాటాల పునాదుల మీద పుట్టి ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలలో నాటుకుపోయిన గులాబీ శక్తి బిఆర్ఎస్ అంటూ హరీష్ రావు వాపోయారు.
అయితే పార్టీ అధినేత కేసీఆర్ అంతర్గత సమావేశాలతో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేత హరీష్ రావు సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలలో సైతం నైరాశ్యం నిండుకుతుంది.







