త్రిష ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న “నాయకి” సినిమా తొలి టీజర్ విడుదలైంది. ‘సత్యం’ రాజేష్ మరో కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు గోవి గోవర్ధన్ దర్శకత్వం వహించగా, మామిడిపల్లి గిరిధర్ నిర్మించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ హార్రర్ సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా ఉంది.
చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ, హార్రర్ సినిమాకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించడంలో రఘు కుంచే సఫలమయ్యాడు. ఇక, త్రిష లుక్స్, ప్రధాన పాత్రలో సత్యం రాజేష్ కనపడడం సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చాయి. అలాగే టీజర్ చివర్లో రాజేష్ చెప్పిన… “నాకు టీజర్ చూసినందుకే కారిపోయింది… మళ్ళీ ఫుల్ మూవీ అంటూ భయపెట్టకే…” అనే డైలాగ్ తో సినిమా ఫుల్ హార్రర్ తో నిండి ఉందన్న సంకేతాలు చిత్ర యూనిట్ ఇచ్చింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



