సినీ పరిశ్రమ మీద ఎంతో ఆసక్తితో రంగుల ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలనే ఆశతో, తనను తానూ ఒక స్టార్ గా వెండితెర మీద ఆవిష్కరించబడాలి అనే ఆత్రుతతో ఎంతోమంది వెండితెర మీద తమ అదృష్టం పరీక్షించుకోవడానికి నటీమణులు గా సినీ రంగంలోకి అడుగు పెడతారు.
అయితే వారందరిలో వెండి తెర మీద వెలుగులు కరిపించి, ప్రేక్షకుల మనసులు దోచుకునే నటీమణులు శాతం చాల తక్కువనే చెప్పాలి. అందునా ఆ నటీమణుల కెరీర్ స్పాన్ కూడా హీరోలతో పోలిస్తే అతి స్వల్పమనే భావించాలి.
ఎన్ని హిట్స్ అందుకున్నా, లక్కీ లేడీగా గుర్తింపు పొందిన హీరోయిన్స్ సైతం కొంతకాలపరిమితికి కనుమరుగయిపోవడం సినీ పరిశ్రమలో పటిపాటిగా జరిగేవే. ఇందుకు అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి సమంత వరకు అందరు ఒకే కోవలోకి వస్తారు. అయితే ఒక్క శ్రీదేవి విషయంలోనే ఈ లెక్కలన్నీ తారుమారయాయ్యి.
ఇందులో బాహుబలి ఫేమ్ అనుష్క నుంచి మగధీర తో టాలీవుడ్ యువరాణిగా మెప్పించిన కాజల్, ఎం మాయ చేసావో అంటూ వచ్చిన సమంత, శ్రీయ, తమన్నా, రాశీ కన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి అగ్ర హీరోల కథానాయకులు ఇప్పుడు తమ ఫామ్ ను కోల్పోయి మెయిన్ లీడ్ హీరోహిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులలో కూడా ఒకరిద్దరు హీరోయిన్స్ తమ కెరీర్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగించుకోగలుగుతున్నారు. ఇప్పటికి అవే అవకాశాలు, అదే ప్రేక్షకాధరణ పొందుతున్నారు. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో అవకాశాలు దక్కించుకుని ఇప్పటికి అదే స్టార్ డమ్ ను అనుభవిస్తున్నారు.
అయితే ఆ ఇద్దరు ఎవరన్నది ఇపుడు చూద్దాం. 2004 లో వర్షం మూవీతో ప్రభాస్ సరసన ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష ఒకరైతే అయితే, 2005 చంద్రముఖి తో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన మెరిసిన నయనతార మరొకరు.
వీరిద్దరు తమ కెరీర్ ను దాదాపుగా ఒకేసారి మొదలుపెట్టారనే చెప్పాలి. అలాగే వీరిద్దరూ కూడా అటు తెలుగు ఇటు తమిళ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకులందరితో దాదాపు స్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకున్నారు.
అయితే వీరిద్దరితో పాటుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ అందరు ఇప్పుడు దాదాపు హీరోయిన్ గా తమ కెరీర్ ను ముగించిన వారే. అయితే స్పెషల్ సాంగ్స్ లోనో, ప్రత్యేక అతిధి పాత్రలోనో కొన్ని కొన్ని మూవీస్ లో కనిపిస్తున్నప్పటికీ వెండితెర మీద మునుపటి మ్యాజిక్ అయితే చేయలేకపోతున్నారు.
కానీ త్రిష, నయన తార మాత్రం ఇప్పటికే అదే అందం, అదే అభినయం చూపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ గా నయనతార మెప్పిస్తుంటే గ్లామర్ డాల్ గా త్రిష ఆకట్టుకుంటున్నారు. వయస్సు తో పాటుగా వీరి అందం కూడా పెరుగుతుందా అన్నట్టుగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మలు.
ఇండస్ట్రీకి ఎన్ని కొత్త అందాలు, కొత్త అభినయాలు పరిచయమైనప్పటికీ ప్రేక్షకులలో వీరి క్రీజ్ అలానే కొనసాగుతుందనే చెప్పాలి. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పీఎస్ సిరీస్ లో త్రిష పాత్ర అందరిని మెప్పించింది. అలాగే లియో మూవీలో విజయ్ తలపతి సరసన హీరోయిన్ గా నటించిన త్రిష తన ఖాతాలో మరో హిట్ వెనకేసుకున్నారు.
విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ అమ్మడు ఈ వయస్సులో కూడా తన డాన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే సెట్స్ మీద ఉన్న మెగా స్టార్ విశ్వంభర సినిమాలో కూడా చిరు కి జోడిగా త్రిష నటించబోతున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా వెండితెర మీద అదే మ్యాజిక్ తో లేడి సూపర్ స్టార్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీ పై ద్రుష్టి పెట్టారు నయనతార.
జవాన్ మూవీతో షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నయనతార. అలాగే ఇటు తెలుగులో కూడా బాలకృష్ణ, చిరు, వెంకీ, నాగార్జున, ఎన్టీఆర్, రవితేజ వంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. ఇటు ఫెర్ఫామెన్స్ అటు గ్లామర్ రెండితోనూ అవకాశాలను సొంత చేసుకుంటూ తగ్గేదెలా అన్నట్టుగా దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు బ్యూటీస్.
అయితే నాలుగు పదుల వయస్సులోనూ అదే జోరు అదే హోరు కొనసాగించడం వీరియిద్దరికే ఎలా సాధ్యమయ్యింది అంటూ ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు వీరి అభిమానులు.




